సాక్షి లేకుంటే...: చిరు కుమార్తె ఇంట్లో డబ్బుపై వాసిరెడ్డి
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్తో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తోడల్లుడికి సంబంధం అనే వార్తను మాత్రం బ్యానర్ చేశారని మండిపడ్డారు. అదే భాను కిరణ్తో జయభేరి అధినేత మురళీ మోహన్కు సంబంధం ఉంటే వార్తే రాయలేదని అన్నారు. ఇవేనా ఆ పత్రికలు పాటించే జర్నలిజం విలువలు అని ఆమె ప్రశ్నించారు.
సాక్షి పత్రిక లేకపోతే చిరంజీవి అల్లుడి ఇంట్లో డబ్బు దొరికిన విషయం వార్తే అయ్యేది కాదన్నారు. చిరంజీవి వియ్యంకుడికి అంత డబ్బు నగదు రూపంలో ఉంచుకునేంతంటి వ్యాపారాలు ఏమీ లేవని ఆమె అన్నారు. ఆ కుటుంబం ఆర్థికపరంగా ఇటీవల పలు ఇబ్బందులను ఎదుర్కొందని చెప్పారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న కుటుంబం వద్ద ఇంత డబ్బు నగదు రూపంలో ఉండే అవకాశమే లేదన్నారు.
తన కూతురింట్లో దొరికిన డబ్బుకు సంబంధించి చిరంజీవి పూర్తి స్థాయి విచారణకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేసిన సందర్భంగా ఏం జరిగిందో, ఏఏ ఒప్పందాలు జరిగాయో వివరించాలన్నారు. డబ్బు దొరికిన ఇల్లు ఎవరిదనేది ఇంత వరకు అధికారికంగా ప్రకటించక పోవడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు.
చిరంజీవి అత్యవసరంగా ఢిల్లీ వెళ్లి ఈ రోజు వాయలార్ రవిని ఎందుకు కలవవలసి వచ్చిందో చెప్పాలన్నారు. కుమార్తె ఇంట్లో డబ్బు దొరికిన అంశంపై మాట్లాడటానికే ఆయన వెళ్లారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.