సన్ స్ట్రోక్ లేదు, రాజీనామాకు సై: భూకబ్జాపై పార్థసారథి

నిబంధనల ప్రకారమే పూర్తిగా నడుచుకున్నానని అన్నారు. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. తన తనయుడికి చదువు తప్ప మరో వ్యాపకం లేదన్నారు. తన తనయుడు ఓ మంచి స్టూడెంట్ అని, తాను మూడేళ్లుగా మంత్రిగా ఉన్నప్పటికీ ఒక్కసారైనా ఏదైనా రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్నారా అని ప్రశ్నించారు. కనీసం తన పక్కన కూడా ఎప్పుడూ ఎవరూ తన తనయుడిని చూసి ఉండరన్నారు.
తనకు ఎలాంటి సన్ స్ట్రోక్ తగలలేదని, తనపై ఆరోపణలు చేసిన వారికే ఫాదర్ స్ట్రోక్ తగిలిందన్నారు. తనపై రాజకీయ దురుద్దేశ్యంతోనే విపక్షాలు దానిని రాద్ధాంతే చేస్తున్నాయన్నారు. అభ్యంతరాలు ఉన్న వారు కోర్టుకు వెళ్లి తేల్చుకునే అవకాశం ఉన్నప్పటికీ తనపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
కోర్టులో రిజిస్ట్రేషన్ తప్పు అని తేలితే తాను భూమిని వదులుకునేందుకు సిద్ధమన్నారు. అంతేకాదు తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. రిజిస్ట్రేషన్ తప్పుడుది కాదని కోర్టే స్వయంగా చెప్పిందని తెలిపారు. తన తనయుడు భూకబ్జా చేశాడని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానన్నారు.
కాగా ఇంటర్ పరీక్షలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. అయితే పలువురు విద్యార్థులకు హాల్ టిక్కెట్లు అందలేదనే విమర్శలపై పార్థసారథి స్పందించారు. పరీక్ష రుసుం సకాలంలో చెల్లించిన విద్యార్థులకు హాల్ టిక్కెట్లు పంపామని పార్థసారథి చెప్పారు. విద్యార్థుల ఆందోళనకు కారణమైన కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని, ఇరవై ముప్పై వేల మంది విద్యార్థుల కోసం పన్నెండు మంది లక్షల విద్యార్థుల పరీక్షలు ఆపాలా అని ఆయన ప్రశ్నించారు. మీడియా వల్లే మొదటి నుండి ఇంత రాద్దాంతం అవుతుందన్నారు.












Click it and Unblock the Notifications