బైపోల్స్ వరకు జైలులోనే జగన్, 2 నిమిషాలు కోర్టులో..

జగన్ బెయిల్ పిటిషన్ కొట్టి వేసింది. అతనికి జూన్ 11వ తేది వరకు(14 రోజులు) జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా జగన్ కోర్టులో రెండు నిమిషాలు మాట్లాడారు. తనను ఎందుకు అరెస్టు చేశారో తనకు తెలియదని ఆయన జడ్జి ముందు వాపోయారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సిబిఐ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానని అన్నారు. అయితే వారు అనుకున్న సమాధానాలు తాను ఇవ్వలేదని అన్నట్లుగా తెలుస్తోంది.
తాను ప్రచారంలో ఉండగా సమన్లు జారీ చేశారని, మూడు రోజుల పాటు సిబిఐకి తాను పూర్తిగా సహకరించానని చెప్పారు. తనను ఎందుకు అరెస్టు చేశారో అర్థం కావడం లేదన్నారు. సాక్షి మీడియాకు విలువ లేదా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే దేశంలో సాక్షి ఎనిమిదో స్థానంలో ఉందని చెప్పారు. సాక్షిలో రూ.300 షేర్ గొప్ప కాదా అన్నారు. ఈనాడు పత్రిక 100 షేరును రూ.5.28 లక్షలకు అమ్ముకుందని, అది తప్పనిపించడం లేదా అని ప్రశ్నించారు.
ఈనాడు సంస్థ రూ.1800 కోట్ల నష్టంలో ఉందన్నారు. సిబిఐ కేవలం ఒక కోణంలో మాత్రమే చూస్తుందని అన్నారు. కాగా సిబిఐ కస్టడీ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. దీంతో సిబిఐ తిరిగి మంగళవారం మళ్లీ కస్టడీ పిటిషన్ వేయనున్నారు. తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకు కోర్టు అంగీకరించింది. ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు. కాగా కోర్టు ఉత్తర్వులతో వైయస్ విజయమ్మ కంట తడి పెట్టారు.












Click it and Unblock the Notifications