ఫస్ట్ డే: జగన్ను విచారిస్తున్న సిబిఐ, స్థలం మార్పు

అయితే జగన్ విచారణ స్థలాన్ని సిబిఐ అధికారులు భద్రతా కారణాల దృష్ట్యా మార్చారు. కోఠిలోని సిబిఐ కార్యాలయంలో జగన్ను విచారించే అవకాశముందని అందరు తొలుత భావించారు. కానీ భద్రత కారణాల దృష్ట్యా జైలు పరిసరాలలోనే జగన్ను ప్రశ్నించేందుకు సిబిఐ అధికారులు సిద్ధమయ్యారు. చంచల్గూడ జైలు నుండి జైళ్ల శాఖ డిజి కార్యాలయానికి తరలించారు. సీనియర్ ఆఫీసర్స్ మెస్లోకి జగన్ను వెనుక గేటు ద్వారా తీసుకు వెళ్లారు. అక్కడే అతనిని విచారిస్తున్నారు. డిజి ఆఫీసు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.
సిబిఐ అధికారులు ఉదయం పదిన్నర గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఐదు రోజుల పాటు విచారించనున్నారు. కాగా సిబిఐ కస్టడీపై హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత న్యాయవాదులు జైలుకు వచ్చి జగన్ను శనివారం కలిశారు. కోర్టులో జరిగిన వాదోపవాదాలపై ఆయనకు వివరించినట్లుగా సమాచారం. కస్టడీలో వ్యవహరించాల్సిన తీరుపై మాట్లాడుకున్నట్టు సమాచారం. రెండు రోజులుగా జగన్కు జైలు అధికారులు ములాఖత్లు నిరాకరిస్తుండటంతో జగన్ శనివారం సాయంత్రం వరకు బ్యారక్కే పరిమితమయ్యారని తెలుస్తోంది.
ఆయన బ్యారక్ వద్దకే తోటి విఐపి ఖైదీలు వెళ్లి కొంతసేపు ముచ్చటించినట్టు సమాచారం. ఉదయం నుంచి కోర్టు విషయాలను తెలుసుకోడానికి జగన్ ఆసక్తిగా ఎదురుచూసినట్టు తెలిసింది. జైలు క్యాంటీన్లో వస్తువులు కొనుగొలు చేసేందుకు జగన్ ఖాతాలో ఆయన వర్గీయులు రూ.4 వేలు జమచేసినట్టుగా సమాచారం.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications