కొడుక్కోసం విజయమ్మ కుట్ర: బొత్స, షర్మిలపై చిరు ఫైర్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేస్తే అవినీతికి గేట్లు తెరిచినట్లేనని ఆయన అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైయస్ జగన్ కోట్లు కొల్లగొట్టారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణిస్తే తామంతా బాధపడ్డామని, భర్త మృతికి కుట్ర జరిగిందని వైయస్ విజయమ్మ ఇప్పుడు అంటున్నారని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనం కోసమే వైయస్ విజయమ్మ ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డిని చంపుకుంటే కాంగ్రెసుకు ఒనగూరే ప్రయోజనం ఏమిటని చిరంజీవి ప్రశ్నించారు. వైయస్ జగన్ పార్టీ పెట్టారని, పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చునని, అయితే వైయస్ జగన్ ఎజెండా, జెండా ముఖ్యమంత్రి పదవి మాత్రమేనని ఆయన అన్నారు. తండ్రి చనిపోతే కుమారుడికి అధికారం దక్కడానికి ఇది రాచరికం కాదని, ఇది ప్రజాస్వామ్యమని, ప్రజలు ఆదరిస్తేనే పదవులు దక్కుతాయని ఆయన అన్నారు. వైయస్ జగన్ పార్టీకి చెందినవారు ఏం త్యాగాలు చేశారని ఆయన అడిగారు. వైయస్ జగన్ సోదరి షర్మిలపై చిరంజీవి మండిపడ్డారు. షర్మిల, అనిల్ లక్షల ఎకరాల గనులను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించారని, షర్మిలకు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు.
రాజీవ్ గాంధీ కుటుంబం, నెహ్రూ కుటుంబం త్యాగాలు చేశాయని, ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు పొగొట్టుకున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్ పార్టీ నాయకులకు త్యాగానికి అర్థం తెలియదని ఆయన అన్నారు. 2004లో 18 లక్షల ఆస్తి చూపించిన వైయస్ జగన్కు ఇప్పుడు అంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందని, అదంతా దోచుకున్నదేనని ఆయన అన్నారు. అనిశ్చిత పరిస్థితికి వైయస్ జగన్ కారణమని ఆయన విమర్శించారు.