గాలి బెయిల్ డీల్: పట్టాభిపై ఎసిబి కేసు నమోదు

ముడుపులు తీసుకుని గాలి జనార్దన్ రెడ్డికి పట్టాభి రామారావు బెయిల్ మంజూరు చేసిన వ్యవహారంపై హైకోర్టు ఎసిబి విచారణకు అప్పగించింది. ఈ వ్యవహారానికి సంబంధించి సిబిఐ ఆడియో, వీడియో ఆధారాలను కూడా సేకరించింది. పట్టాభి సిబిఐ కేసుల ప్రత్యేక కోర్టు జడ్జిగా ఉన్నప్పటికీ ఆయనకు రాష్ట్ర ప్రభుత్వమే జీతం చెల్లిస్తుంది.
ఆయనను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగిగానే భావించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకున్న కేసుల్లో మాత్రమే సిబిఐ కేసులు నమోదు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి సంగతి ఎసిబియే చూస్తుంది. న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం సిబిఐ హైకోర్టుకు మొత్తం పరిస్థితిని వివరించింది. చివరికి, ఈ కేసు దర్యాప్తు బాధ్యతను ఎసిబికి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
శుక్రవారం సాయంత్రం హైకోర్టు నుంచి కేసు ఫైలు ఎసిబికి అందింది. వెంటనే ఎసిబి లీగల్ సెల్ నిపుణులు దీనిని అధ్యయనం చేశారు. తమకు అందిన సమాచారాన్ని మొదటి నుంచి అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోకూర్కు సిబిఐ నివేదిస్తూనే ఉంది. బెయిల్ బేరసారాలపై సిబిఐ పక్కా ఆధారాలు సేకరించినందున ఎసిబి పని సులువైనట్లే. మరోవైపు, ఈ వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేసినప్పటికీ, సిబిఐ దర్యాప్తు కూడా కొనసాగవచ్చని న్యాయవాద వర్గాలు పేర్కొంటున్నాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications