వైయస్ జగన్ పోస్టు కార్డును వాడుకుంటారా?

ఉప ఎన్నికల సందర్బంగా ఓటర్లకు విజ్ఞప్తి చేయడానికి ఆధునిక సౌకర్యాలు ఆయనకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఈ నెల 12వ తేదీన 18 శానససభా స్థానాలకు, ఓ లోకసభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థితిలో ఆయన పోస్టు కార్డులను వినియోగించుకునే వీలుంది.
జైలు మాన్యువల్ ప్రకారం - ఖైదీ పక్షం రోజుల్లో ప్రభుత్వం ఖర్చుతో ఓ పోస్టు కార్డు వాడుకోవచ్చు. అండర్ టర్యల్ ఖైదీ ఆ పోస్టు కార్డును తన కుటుంబ సభ్యులకు, బంధువులకు లేదా మిత్రులకు ఉత్తరం రాయడానికి పోస్టు కార్డును వాడుకోవచ్చు. అయితే, పోస్టు కార్డులోని విషయాన్ని జైలు అధికారులు సెన్సార్ చేస్తారు. అభ్యంతరకరమైన విషయాలు లేకుండా చూస్తారు.
ఈ స్థితిలో వైయస్ జగన్ పోస్టు కార్డును వాడుకుని ఓటర్లకు ఏదో రూపంలో విజ్ఞప్తి చేసుకునే అవకాశాలున్నాయి. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉత్తరం రాయవచ్చుననే ఐడియా వస్తుందా, ఆయనకు ఈ ఐడియాను ఎవరైనా అందజేస్తారా అనేది చూడాల్సిన విషయం. పోస్టు కార్డు ధర యాభై పైసలు మాత్రమే. దాని ఖర్చును కూడా ప్రభుత్వం భరిస్తుంది.












Click it and Unblock the Notifications