వ్యూహం మార్చి వైయస్ జగన్‌ను ప్రశ్నించిన సిబిఐ

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను సిబిఐ అధికారులు రెండో విడత మొదటి రోజు శనివారం ప్రశ్నించింది. సాయంత్రం ఐదు గంటలకు జగన్‌ను ప్రశ్నించడం ముగించి చంచల్‌గుడా జైలుకు తరలించింది. జగన్ కంపెనీల్లోకి విదేశీ పెట్టుబడులు వచ్చిన తీరుపై సిబిఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. వైయస్ జగన్‌ను ఒక్కడినే విచారించింది.

వైయస్ జగన్ ఆస్తుల కేసులో విచారణకు అందుబాటులో ఉండాలని పలువురికి సిబిఐ అధికారులు చెప్పారు. అయితే, వారెవరినీ సిబిఐ పిలువలేదు. వ్యూహం మార్చి సిబిఐ అధికారులు జగన్‌ను ఏకాంతంగా ఒక్కడినే ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విదేశీ లావాదేవీలకు సంబంధించి వైయస్ జగన్ నుంచి కొంత మేరకు శనివారం సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.

ఏసియన్ ఇన్‌ఫ్రా అసలు యజమానులపై సిబిఐ అధికారులు జగన్‌ను ఆరా తీసినట్లు సమాచారం. నగల వ్యాపారి సుఖేష్ గుప్తాతో ఆర్థిక లావాదేవీలపై కూడా సిబిఐ అధికారులు ఆయనను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ రోజు, రేపు విచారణకు హాజరు కావాలని సిబిఐ అధికారులు విజయసాయి రెడ్డిని అదేశించింది. సింఘానియా అనే వ్యక్తిని సిబిఐ గతంలో ఓసారి విచారించింది. అందుబాటులో ఉండాలని సిబిఐ ఆయనను ఆదేశించినట్లు తెలుస్తోంది.

వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అధికారులు శనివారం ఉదయం తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఆయన చంచల్‌గుడా జైలు నుంచి కోఠీలోని తమ కార్యాలయానికి ఉదయం తరలించారు. ఇంతకు ముందు ఐదు రోజుల పాటు సిబిఐ అధికారులు వైయస్ జగన్‌ను ప్రశ్నించారు. రేపు ఆదివారం కూడా సిబిఐ అధికారులు జగన్‌ను ప్రశ్నిస్తారు.

వైయస్ జగన్‌ను మరో మూడు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, రెండు రోజుల పాటు వైయస్ జగన్‌ను సిబిఐ కోర్టు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల్లో మొదటి రోజు విచారణ శనివారం సాయంత్రం ముగిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+