ఎమ్మిగనూరు: అనుచరులతో టిడిపి అభ్యర్థి బివిఎం ఢీ

తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత 2004, 2009 ఎన్నికల్లో చెన్నకేశవ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బివిపై గెలిచారు. అప్పటి వరకు టిడిపిలో ఉన్న రుద్ర గౌడ్ కాంగ్రెస్లో చేరి ప్రస్తుతం ఆ పార్టీ అభ్యర్థి అయ్యారు. అయితే, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం అభ్యర్థులు సానుభూతిని నమ్ముకుని ముందుకు సాగుతుంటే.. సామాజికవర్గ ఓట్లపై కాంగ్రెస్ అభ్యర్థి ఆధారపడ్డారు. జగన్ జైలుకు వెళ్లడం, విజయలక్ష్మి ప్రచారం ద్వారా వచ్చే సానుభూతి గట్టెక్కిస్తుందని చెన్నకేశవ రెడ్డి ధీమాగా ఉన్నారు.
అయితే, ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి నియోజకవర్గ అభివృద్ధి ఆగిపోయిందని, మద్యం, ఇసుక వ్యాపారాలను అభివృద్ధి చేసుకుని ఆయన వందల కోట్లు గడించారనే అరోపణలను ప్రత్యర్థి పార్టీలు ప్రధాన ప్రచారాస్త్రంగా తెరపైకి తెచ్చాయి. ఇక ఉప ఎన్నికల ప్రచారానికి రెండు నెలల ముందే ప్రచార బరిలోకి దిగిన టిడిపి అభ్యర్థి మోహన రెడ్డి ఎండల్లో తిరగడంతో అనారోగ్యం పాలయ్యారు. వారం రోజులపాటు హైదరాబాద్లో చికిత్స చేయించుకున్నారు. పోలింగ్ సమీపిస్తున్నా విశ్రాంతిలోనే ఉంటూ వీల్ చైయిర్పై అప్పుడప్పుడూ ప్రచారం చేస్తున్నారు.
నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి, రెండుసార్లు వరుస ఓటములతోపాటు ఇటీవలి అనారోగ్యం ద్వారా వచ్చే సానుభూతి తనను గట్టెక్కిస్తుందని ఆయన భావిస్తున్నారు. అదే సమయంలో, పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. ఎంపి కోట్ల సూర్యప్రకాశ రెడ్డి, రాష్ట్ర మంత్రి టిజి వెంకటేశ్ చెమటోడుస్తున్నారు. ఉప ఎన్నికల నోటిఫికేషన్ నాటికి అంతంతమాత్రంగా ఉన్న పార్టీని ప్రచారం ముగిసే సమయానికి కొంత బలోపేతం చేశారన్న అంచనాలు ఉన్నాయి.
ఇక్కడ టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థులు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాగా.. కాంగ్రెస్ అభ్యర్థి బిసి నేత. నియోజకవర్గంలో మొత్తం 1,89,258 ఓట్లుండగా అందులో బీసీల ఓట్లు లక్షకుపైగా ఉన్నాయి. వారిలో వాల్మీకులు 43 వేలు, సాలె, కుర్మి 27,500, గొల్ల, కురవ, ఉప్పర కలిపి సుమారు 30 వేల ఓట్లున్నాయి. ఈ నేపథ్యంలో బీసీల ఓట్లే తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
-
పంచె కట్టులో మెరిసిన జగన్, సతీ సమేతంగా ఉగాది వేడుకలు -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications