ఉప పోరులో జగన్‌దే విజయం: వన్ ఇండియా సర్వే

YS Jagan
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో ఫలితాలు వెలువడక ముందే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ విజయం ఖాయమైపోయింది. నెల్లూరు లోకసభకు, 18 శానససభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైయస్ జగన్ మెజారిటీ సీట్లు సాధిస్తారనే విషయాన్ని అన్ని వర్గాలవారు అంగీకరిస్తున్నారు. ఫలితాలు రేపు శుక్రవారం వెలువడనున్నాయి.

అవినీతి ఆరోపణలు ఎన్ని వచ్చినప్పటికీ, ఆ ఆరోపణలతో జైలు పాలైనప్పటికీ వైయస్ జగన్‌కు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజల మద్దతును పొందడంలో విజయం సాధించినట్లు సర్వే ఫలితాలు తెలియజేస్తున్నారు. ప్రముఖ ఆన్‌లైన్ పోర్టలో వన్ ఇండియా నిర్వహించిన సర్వేలో కూడా వైయస్ జగన్ విజేతగా నిలిచారు.

అవినీతి ఆరోపణలు ఫలితాలపై వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయని కేవలం 12.5 శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు. పోలింగ్‌కు ముందు జగన్ అరెస్టు కావడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి లాభించిందని 41.7 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఫలితాల ప్రభావం అనంతర రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతుందని చాలా మంది అభిప్రాయపడ్డారు.

వన్ ఇండియా తెలుగు నిర్వహించిన సర్వేలో కూడా వైయస్ జగన్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది. జగన్ అరెస్టు తర్వాత కూడా వైయస్ జగన్ పార్టీ మెజారిటీ సీట్లు సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని 65.8 శాతం మంది అభిప్రాయపడగా, తెలుగుదేశం పార్టీకి 26.5 శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు. కాంగ్రెసు పార్టీకి 7.7 శాతం మంది మాత్రమే ఓటేశారు.

కాగా, నెల్లూరు లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి విజయం ఖాయమైనట్లు భావించవచ్చు. నెల రోజుల్లో ఎలా గెలుస్తామని కాంగ్రెసు అభ్యర్థి టి. సుబ్బిరామిరెడ్డి కూతురు పింకీ అన్నారు. దీన్ని బట్టి కాంగ్రెసు ఓడిపోతుందనే విషయం తేలిపోయినట్లే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+