బిజెపికి జయ షాక్: సంగ్మాకు మద్దతుపై వెనకంజ?

జయలలిత మాటలతో దిగ్భ్రాంతికి గురైన బిజెపి తాజా పరిస్థితిని సమీక్షిస్తోంది. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత రేసు నుంచి సంగ్మా తప్పుకోవాలని జయలలిత సూచించినట్లు తెలుస్తోంది. సంగ్మా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి రావాలని ఫోన్ చేసి అద్వానీ జయలలితను ఆహ్వానించారని అంటున్నారు. ఈ సమయంలో జయలలిత ఆ సూచన చేసినట్లు తెలుస్తోంది.
తాను నెల పాటు కోడనాడులో చికిత్స తీసుకుంటున్నానని, అందు వల్ల తాను ప్రయాణం చేయలేనని చెబుతూ అద్వానీ అహ్వానాన్ని జయలలిత తిరస్కరించినట్లు చెబుతున్నారు. ఇదిలా వుంటే, రాష్ట్రపతి అభ్యర్థిగా సంగ్మా గురువారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను ఆయన సమర్పించారు.
సంగ్మా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి బిజెపి అగ్ర నేతలు ఎల్కె అద్వానీ, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీ, పంజాబ్ ముఖ్యమంత్రి బాదల్, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హాజరయ్యారు. యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ గురువారం ఉదయమే నామినేషన్ దాఖలు చేశారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications