రాష్ట్రపతి ఎన్నిక: ప్రణబ్ ముఖర్జీ నామినేషన్ దాఖలు

మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెసు ప్రతినిధులు రాలేదు. ప్రస్తుతం ప్రణబ్ ముఖర్జీకి 63 శాతం ఓటర్ల బలం ఉండగా, ప్రత్యర్థి పిఎ సంగ్మాకు 30 శాతం ఓట్ల బలం ఉంది. మిగతా ఏడు శాతం ఓట్లు గల పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయలేదు. తృణమూల్ కాంగ్రెసు, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు, తదితర పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తారనే విషయాన్ని తేల్చుకోలేదు.
ప్రణబ్ ముఖర్జీ దాఖలు చేసిన నాలుగు సెట్ల నామినేషన్ పత్రాల్లో ముఖ్యమైన 480 మంది సంతకాలున్నాయి. జనతాదళ్ (యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ కూడా నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. మాయావతి నాయకత్వంలోని బిఎస్పీ కూడా ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇస్తోంది. నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ మీడియాతో మాట్లాడారు.
యుపిఎలో లేని పార్టీ మద్దతు కూడా తనకు ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తన పేరును ప్రతిపాదించడం తనకు ఎంత గౌరవప్రదమని ఆయన అన్నారు. శరద్ పవార్ (ఎన్సీపి), టీఆర్ బాలు (డిఎంకె), ఫరూఖ్ అబ్దుల్లా (ఎన్సి), ఇ అహ్మద్ (ఐయుఎంఎల్) కూడా ప్రణబ్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరయ్యారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ భాగస్వామ్య పక్షాలు జెడి (యు), శివసేన కూడా ప్రణబ్ ముఖర్జీకి మద్దతు పలికాయి.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications