ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా లేడీ ఐఎఎస్ మాథ్యూస్

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రెండో మహిళా ఐఎఎస్ అధికారి మిన్నీ మాథ్యూస్. అంతకు ముందు సతీ నాయర్ 2002లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ ఇద్దరు ఐఎఎస్ అధికారులు కూడా కేరళకు చెందినవారే కావడం విశేషం.
ఇప్పటి వరకు మిన్నీ మాథ్యూస్ భూపరిపాలన చీఫ్ కమీషనర్గా ఉన్నారు. మాథ్యూస్ 2013 ఫిబ్రవరి 28వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. 1975 బ్యాచ్కు చెందిన పంకజ్ ద్వివేదీకి మరో మూడు నెలల పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగడానికి పొడగింపు ఇస్తారని భావించినప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మిన్నీ మాథ్యూస్ నియామకానికే ప్రాధాన్యం ఇచ్చారు.
సీనియర్లను పక్కన పెట్టి దినేష్ రెడ్డిని డిజిపిగా నియమించడంతో తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ముఖ్యమంత్రి మిన్నీ మాథ్యూస్ నియామకానికే ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. దినేష్ రెడ్డి నియామకంపై అసంతృప్తి చెందిన ఐపియస్ అధికారి గౌతం కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు సిద్ధపడిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications