మత్స్యకారులకు విజయమ్మ పరామర్శ: వెంట షర్మిల

పదిహేను రోజులలోగా న్యాయం జరిగేలా చూడాలని ఎన్టిపిసి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఎన్టిపిసి వల్ల మత్స్యకారులు బాధలు పడుతున్నారని అన్నారు. వారు బాధితులుగా మారారని అన్నారు. కాబట్టి వారికి న్యాయం అందించేందుకు యాజమాన్యం సత్వరమే చర్యలు చేపట్టాలని కోరారు. తమ పార్టీ ప్రజల పక్షాన ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎన్టిపిసి జనరల్ మేనేజర్తో మధ్యాహ్నం భేటీ ఉపాధి చేపట్టాలని సూచించారు.
మత్స్యకార్మికులకు ఉపాధి కల్పించకుంటే తమ పార్టీ ఆందోళన బాట పట్టాల్సి ఉంటుందని చెప్పారు. పలువురు మత్స్యకారులు విజయమ్మకు వినతి పత్రాన్ని అందజేశారు. మత్స్యకారుల కష్టాలు తీరే వరకు వైయస్సార్ కాంగ్రెసు వారి వెన్నంటే ఉంటుందని షర్మిల అన్నారు. ప్రాజెక్టు వల్ల వారికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, అలాగని ప్రాజెక్టు వచ్చాక ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం లేదన్నారు.
అంతకుముందు విశాఖపట్నం విమానాశ్రయంలో దిగిన విజయమ్మకు, షర్మిలకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తిక్కవానిపాలంలో పరామర్శ అనంతరం వారు విశాఖపట్నం నుండి హైదరాబాద్ బయలుదేరారు.












Click it and Unblock the Notifications