వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జి దెబ్బకు పవార్ ఠా: ఈజిఓఎం అధ్యక్ష పదవికి నో

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sharad Pawar
న్యూఢిల్లీ: 2జి కుంభకోణం తర్వాత అందుకు సంబంధించిన పదవి అంటేనే కేంద్ర ప్రభుత్వంలో వణుకు పుడుతున్నట్లుగా కనిపిస్తోంది. టెలికాం వ్యవహారాలపై ఏర్పాటు చేసిన సాధికారక మంత్రుల బృందం(ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) అధ్యక్ష పదవిని వదులుకున్నారు. సోమవారం ఆయన ఈ పదవికి రాం రాం చెప్పారు. మాజీ కేంద్రమంత్రి, రాష్ట్రపతి యుపిఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ రాజీనామా తర్వాత ఈ పదవిని పవార్‌కు అప్పగించారు.

అయితే ఎటు పోయి ఎటు వస్తుందో అన్న భయంతో శరద్ పవార్ ఆ పదవిని వదులుకున్నారు. పదవిని కట్టబెట్టిన మూడు రోజులలోనే ఆయన ఆ పదవిని వదులుకున్నారు. సోమవారం పవార్ నేతృత్వంలోని మంత్రుల బృందం సమావేశం జరగాల్సి ఉంది. అయితే ముందుగా సమావేశాన్ని వాయిదా వేసిన పవార్, ఆ తర్వాత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఓ లేఖ రాశారు.

2జి స్పెక్ట్రం కుంభకోణంలోకి తనను లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో ఈజివోఎం పదవిని వదులుకోవడమే తనకు సరైనదని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తన వినతికి ప్రధానమంత్రి సమ్మతి తెలిపారని పవార్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా 2జి కుంభకోణం కేసులో లబ్ధిదారైన ఓ టెలికం కంపెనీని ప్రమోట్ చేసిన ఓ సంస్థతో శరద్ పవార్‌కు సంబంధాలున్నాయనే ఆరోపణలు వచ్చాయి. వాటిని అప్పుడే పవార్ ఖండించారు.

కాగా 2జి కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇది రూ.లక్షా డెబ్బయి అయిదువేల కుంభకోణమనే ఆరోపణలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన మాజీ కేంద్రమంత్రి రాజా ఇటీవల వరకు జైలులో ఉండి బెయిల్ పైన విడుదలయ్యారు.

English summary
Fearing attempts to drag him into controversies, Agriculture Minister Sharad Pawar Monday recused himself from heading the Empowered Group of Ministers (EGoM) on telecom, three days after he replaced Pranab Mukherjee in the job.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X