2జి దెబ్బకు పవార్ ఠా: ఈజిఓఎం అధ్యక్ష పదవికి నో
అయితే ఎటు పోయి ఎటు వస్తుందో అన్న భయంతో శరద్ పవార్ ఆ పదవిని వదులుకున్నారు. పదవిని కట్టబెట్టిన మూడు రోజులలోనే ఆయన ఆ పదవిని వదులుకున్నారు. సోమవారం పవార్ నేతృత్వంలోని మంత్రుల బృందం సమావేశం జరగాల్సి ఉంది. అయితే ముందుగా సమావేశాన్ని వాయిదా వేసిన పవార్, ఆ తర్వాత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు ఓ లేఖ రాశారు.
2జి స్పెక్ట్రం కుంభకోణంలోకి తనను లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో ఈజివోఎం పదవిని వదులుకోవడమే తనకు సరైనదని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తన వినతికి ప్రధానమంత్రి సమ్మతి తెలిపారని పవార్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా 2జి కుంభకోణం కేసులో లబ్ధిదారైన ఓ టెలికం కంపెనీని ప్రమోట్ చేసిన ఓ సంస్థతో శరద్ పవార్కు సంబంధాలున్నాయనే ఆరోపణలు వచ్చాయి. వాటిని అప్పుడే పవార్ ఖండించారు.
కాగా 2జి కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇది రూ.లక్షా డెబ్బయి అయిదువేల కుంభకోణమనే ఆరోపణలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన మాజీ కేంద్రమంత్రి రాజా ఇటీవల వరకు జైలులో ఉండి బెయిల్ పైన విడుదలయ్యారు.