వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబ్బే పరమార్థమనుకుంటే జైలుకెళ్లారు: కిరణ్ హితవు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
చిత్తూరు: డబ్బు సంపాదనే పరామర్థమనుకుంటే జైలుకు వెళ్లిన వ్యక్తులు కూడా ఉన్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం అన్నారు. ఆయన చిత్తూరు జిల్లాలో విద్యాపక్ష వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో కిరణ్ మాట్లాడారు. డబ్బు కాంక్ష పెరిగిపోయి విలువలు లేకుండా ఉన్న వారు జైళ్లకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయన్నారు. కేవలం డబ్బుతోనే రాణిస్తామంటే కుదరదని చెప్పారు.

మనం ఈ ప్రపంచంలోనికి వట్టి చేతులతో వచ్చామని వట్టి చేతులతోనే వెళతామని హితబోధ చేసారు. జీవితం బాగా ఉండాలంటే, కుటుంబాన్ని సక్రమంగా పోషించాలంటే న్యాయపరంగా, చట్టపరంగా డబ్బు సంపాదించడం పిల్లలకు నేర్పాలన్నారు. పిల్లలకు విలువలు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైనే ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. విద్యార్థులు తాము అనుకున్న మార్గంలోనే నడవాలన్నారు.

ఇప్పటి నుండే ఓ లక్ష్యాన్ని చూడాలన్నారు. కష్టపడకుంటే ఫలితం రాదని, మనకంటే ఒకరు పైన ఉంటే చూసి ఈర్ష పడవద్దని, కష్టపడి వారి సాధించాలన్నారు. నాణ్యమైన విద్య, మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని చెప్పారు. పిల్లలు తల్లిదండ్రుల బలవంతంతో చదవద్దన్నారు. డ్రాపౌట్సును పాఠశాలలకు పంపించడమే ఈ విద్యా పక్షోత్సవాల లక్ష్యమన్నారు. చదువు పైన దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు.

క్రీడలు ఏకాగ్రతను పెంచి జీవితంలో గెలుపోటములు తట్టుకునే శక్తిని ఇస్తాయని చెప్పారు. ప్రతి పాఠశాలకు పిఈటిని నియమిస్తామని, అలాగే కంప్యూటర్ కూడా తప్పని సరి అని చెప్పారు. ఇల్లు, బడి విద్యార్థులకు విలువలను నేర్పించాలని చెప్పారు.

English summary
Chief Minister Kiran Kumar Reddy commented YSR 
 
 Congress party chief and Kadapa MP YS Jaganmohan 
 
 Reddy indirectly in Vidya Paskha Vaarothsavalu on 
 
 Monday in Chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X