టిడిపి, జగన్ పార్టీ మధ్యే: కొడాలి నాని, రేవంత్ కౌంటర్

తన ఆత్మ ప్రభోదానుసారం తాను ఓటు వేశానని చెప్పారు. ఓటు వేయడం తన బాధ్యత కాబట్టి వేశానన్నారు. కాగా పిటిషన్ల కమిటీ అధ్యక్షునిగా ఉన్న మల్లు భట్టి విక్రమార్కను కలిసేందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మల్యేలు పయ్యావుల కేశవ్, రేవంత్ రెడ్డి వచ్చారు. అదే సమయంలో కొడాలి నాని కూడా వచ్చారు. ఈ సమయంలో నాని మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ ఫినిష్ అయినట్లేనని, వచ్చే ఎన్నికలలో పోటీ వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ మధ్యే ఉంటుందని చెప్పారు.
ఆయన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ పోటీలో ఎవరు గెలుస్తారు... ఏ పార్టీ ఫినిష్ అవుతుందనేది ఢిల్లీలో జరుగుతున్న దానిని బట్టి ఉంటుందని కామెంట్ చేశారు. ఈ రోజు పరిస్థితిని బట్టి రెండేళ్ల తర్వాత ఏం జరుగుతుందనే సంగతిని ఇప్పుడే చెప్పలేమని అన్నారు.
కాగా రాష్ట్రపతి ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ.. కొడాలి నాని, చిన్నం రామకోటయ్య, వేణుగోపాల చారి, హరీశ్వర్ రెడ్డి, జగన్ వర్గం ఎమ్మెల్యే బాలనాగి రెడ్డిలు తమ ఓటును వేశారు. పార్టీలో చర్చించి వారిపై వేటు విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
-
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications