కిరణ్, బొత్సలకు ఊరట: మార్పులేదన్న కృష్ణమూర్తి
అయితే త్వరలో రాష్ట్ర కాంగ్రెస్లో ప్రక్షాళన జరుగుతుందని మాత్రం ఆయన వెల్లడించారు. త్వరలోనే పిసిసి కార్యదర్శులను నియమిస్తారని, అలాగే కార్యకర్తలతో పార్టీ నాయకులు విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తారనీ ఆయన వెల్లడించారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మార్పులూ చేర్పులూ ఉండవచ్చునని ఆయన అన్నారు. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా ఉంటుందని ఆయన చెప్పారు.
బెయిలు సంపాదించడానికే వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్రపతి ఎన్నికలో ప్రణబ్ ముఖర్జీకి ఓట్లు వేసిందన్న ఆరోపణలలో నిజం లేదని ఆయన వివరించారు. ఇకపోతే తెలంగాణ చాలా ముఖ్యమైన అంశమని, అయితే అది తన పరిధిలో లేదని ఆయన వివరించారు. బెయిల్ కోసమే ప్రణబ్ ముఖర్జీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రణబ్ ముఖర్జీకి ఓటేసిందని తెలుగుదేశం పార్టీతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా విమర్శిస్తోంది.
ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై కాంగ్రెసు అధిష్టానం దృష్టి పెడుతుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూ వస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తప్పించవచ్చుననే ఊహాగానాలు కూడా చెలరేగాయి. కృష్ణమూర్తి ప్రకటనతో ఆ ప్రచారానికి తెర పడుతుందని భావించవచ్చు.