Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెయిల్ డీల్: 20 కాదు 100 కోట్లకు సిద్ధపడ్డ 'గాలి'

Gali Janardhan Reddy
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తన బెయిల్ డీల్ కోసం రూ.100 కోట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. జిల్లా న్యాయమూర్తి లక్ష్మీ నరసింహ రావు తన నేరాంగీకార పత్రంలో గాలి బెయిల్ కోసం అంత పెద్ద మొత్తం కూడా ఇచ్చేందుకు సిద్ధపడ్డారని ఎసిబి అధికారులకు తెలిపాడు. గాలి బెయిల్ కేసులో లక్ష్మీ నరసింహ రావు సంచలన నిజాలు బయటపెట్టాడు.

గాలి బెయిల్ డీల్ కోసం ఆయనకు సంబంధించిన వారు రూ.100 కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడ్డారని ఆయన తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. గాలి బంధువు దశరథ రామి రెడ్డి తనకు వంద కోట్లు ఆఫర్ చేశారని, దాంతో తాను బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశానని చెప్పారు. నాటి సిబిఐ జడ్జి నాగమారుతి శర్మతో బెయిల్ పైన చర్చించానని, అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించారని పేర్కొన్నారు.

ఆ తర్వాత రంగంలోకి రావి సూర్య ప్రకాశ్ రావు దిగారని, నాగమారుతి బదలీ కావడంతో పట్టాభి రామారావు వచ్చారని, ఆయనతో తాను రూ.15 కోట్లకు డీల్ కుదుర్చుకున్నానని చెప్పారు. అయితే తాను చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, పట్టాభి మరొకరితో డీల్ కుదుర్చుకొని బెయిల్ ఇచ్చారని చెప్పారు. ఈ నెల 11వ తేదిన ఎసిబి అధికారులు హైదర్‌గూడలోని లక్ష్మీ నరసింహ రావు ఇంట్లోనే ఆయన నుండి వాంగ్మూలాన్ని తీసుకున్నారు.

అదే సమయంలో గాలి బెయిల్ డీల్‌కు సంబంధించి ఆయన పేరు రావడంతో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయన ఇంట్లో రూ.72 లక్షల చెక్కులు దొరికాయి. వాటితో పాటు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా గాలి బెయిల్ కేసులో ఇప్పటికే పలువురు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తి అరెస్టయిన విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+