దోషినైతే ఉరి తీయండి: గోద్రా అల్లర్లపై నరేంద్ర మోడీ
మిత్రులమంతా గుజరాత్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సలీం, భట్ ఏ సమస్యకైనా చర్చలు ముఖ్యమని అన్నారని, మోడీ ఇంటర్వ్యూకు అంగీకరిస్తారని తాను అనుకోలేదని నయీ దునియా సంపాదకుడు సిద్దిఖి అన్నారు. మోడీ ఇంటర్వ్యూతో తమ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్కు ఏ విధమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
తమ ఇంటర్వ్యూతో ఎస్పీకి గానీ నేతాజీకి (ములాయంకు) గానీ ఏ విధమైన సంబంధం లేదని, తాను మొదట జర్నలిస్టునని, ఆ తర్వాత పార్టీ సభ్యుడినని ఆయన అన్నారు. సాహిద్ జర్నలిస్టుగా తన విధి నిర్వహించారని, దాన్ని పిఆర్ వ్యవహారంగా చూడడం దురదృష్టకరమని భట్ అన్నారు.
గుజరాతీ వ్యాపారవేత్త జాఫర్ సరేష్వాలా నివాసంలో సిద్ధిఖితో చర్చలు జరిగినట్లు మహేష్ భట్ ధృవీకరించారు. గోద్రా అల్లర్ల అనంతర పరిస్థితిపై కూడా మోడీ సిద్ధిఖి ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఉర్దూ పత్రికకు మోడీ ఇంటర్వ్యూ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.