పార్థసారథికి ఊరట, శిక్ష ఉత్తర్వుల నిలుపుదల

Parthasarathi
హైదరాబాద్: ఫెరా ఉల్లంఘన కేసులో రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథికి విధించిన శిక్ష ఉత్తర్వులను నాంపల్లి కోర్టు తాత్కాలికంగా నిలిపేసింది. కెపిఆర్ టెలిప్రొడక్ట్ సంస్థకు డైరెక్టర్ హోదాలో ఫెరా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఆయనకు జరిమానాతో పాటు రెండు నెలల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ పార్థసారథి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సోమవారం కోర్టును ఆశ్రయించారు.

మంత్రి పార్థసారథి ఫెరా నిబంధనలను ఉల్లంఘించినట్లుగా జులై 25వ తేదీన ఆర్థిక నేరాల కోర్టు నిర్ధారించింది. గతంలో తన కంపెనీ మిషనరీ కొనుగోలు విషయంలో ఫెరా నిబంధనలు ఉల్లంఘించినట్లుగా పార్థసారథిపై అభియోగాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో మంత్రి ఈ రోజు ఉదయం ఆర్థిక నేరాల కోర్టులో హాజరయ్యారు. విచారణ జరిపిన కోర్టు మంత్రి నేరం చేసినట్లుగా నిర్ధారించింది.

కోర్టు ఆయనకు రూ.5లక్షల 15వేల జరిమానాతో పాటు రెండు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. ఫెరా ఉల్లంఘన కేసులో కెపిఆర్ సంస్థను మొదటి నిందితుడిగా పేర్కొంటూ సంస్థకు రూ.5 లక్షలు, పార్థసారథిని రెండో నిందితుడిగా పేర్కొంటూ అతనికి రూ.5 వేల జరిమానా విధించింది. మరో కేసులో రూ.10వేల జరిమానా విధించింది. జరిమానా కట్టని పక్షంలో మరో పది నెలలు జైలు శిక్ష విధించింది. అయితే తాత్కాలికంగా జైలు శిక్షను నిలుపుదల చేస్తూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ఈ బెయిల్ మంజూరు చేసింది. ఇందుకోసం ఓ నెల రోజులు గడువు కూడా ఇచ్చింది. ఇందుకుగాను మంత్రి పూచికత్తు కోర్టుకు సమర్పించారు.

పెరా నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఆర్థిక నేరాల కోర్టు అంతకు ముందు మంత్రికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాను ప్రభుత్వ కార్యకలాపాలలో బిజీగా ఉన్నందువల్ల కోర్టుకు హాజరు కాలేదని మంత్రి వివరణ ఇచ్చినందువల్ల వారెంట్ వెనక్కి తీసుకుంది. కాగా ఫెరా నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఈడి గతంలో పార్థసారథికి మూడు లక్షల రూపాయల జరిమానా విధించింది. దానిని మంత్రి చెల్లించలేదు. అంతేకాకుండా పలుమార్లు కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ హాజరు కాలేదు. విచారణకు సహకరించలేదు.

దీంతో ఈడి ఆర్థిక నేరాల కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడి పిటిషన్ స్వీకరించిన కోర్టు మంత్రికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పార్థసారథి 1994లో కెపిఆర్ టెలి ప్రోడక్ట్స్ పేరుతో ఓ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ కోసం రూ.60 లక్షల మిషనరీని కొనుగోలు చేశారు. ఈ కొనుగోలులో ఆయన పెరా నిబంధనలు ఉల్లంఘించారని అభియోగాలు ఉన్నాయి. ఆ కంపెనీ ఎండిగా ఆయనపై ఈడి ఆయనపై కేసు పెట్టింది. రూ.3 లక్షల జరిమానా విధించింది. ఈ కేసు 2002 నుండి కేసు కొనసాగుతోంది. మంత్రి పార్థసారథి అప్పటి నుండి ఇప్పటి వరకు జరిమానా కట్టక పోగా ఇంత వరకు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+