బాగాలేదు: అఖిలేష్ ప్రభుత్వంపై ములాయం అసంతృప్తి

Mulayam pulls up son Akhilesh Yadav’s government for non performance
లక్నో: తన తనయుడు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం పని తీరుపై ఆయన తండ్రి, సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు. అఖిలేష్ ప్రభుత్వం పని తీరుపై ములాయం పలు సూచనలు చేశారు. తీరు మార్చుకోవాలని బుద్ధులు చెప్పారు. మీ పని తీరు బాగోలేదని, ఇలాగైతే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు సాధించలేదమని, ఇప్పటికైనా గాడిన పడాలని సొంత ప్రభుత్వానికే ములాయం సింగ్ హెచ్చరికలు చేశారు.

ప్రజల్లో పార్టీకి, ప్రభుత్వానికి ప్రతిష్ఠను పెంచే చర్యలు చేపట్టాలని, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని మానుకోవాలని సూచించారు. మంగళవారం రాత్రి పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో.. తన కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సమక్షంలోనే ములాయం ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన అఖిలేశ్.. తన పాలనపై మొదటిసారిగా, అదీ తన తండ్రి నుంచే విమర్శలు ఎదురుకావడంతో.. ఏమీ చెప్పలేక పోయారు.

మొత్తానికి తండ్రి వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ములాయం అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నిస్తామని, పొరపాట్లు ఉంటే దిద్దుకుంటామని అఖిలేశ్ చెప్పారు. అయితే.. రాష్ట్రంలో గణనీయ స్థాయిలో మార్పులు తీసుకురావడానికి అఖిలేశ్ ప్రభుత్వానికి ములాయం ఆరు నెలలు గడువు ఇచ్చారట.

ఆ లోగానే ప్రజల్లో పార్టీకి, ప్రభుత్వానికి ప్రతిష్ఠను పెంచే చర్యలు తీసుకోవాలని ఆయన అప్పట్లోనే సూచించారు. కానీ, ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలైనా పెద్ద స్థాయిలో ప్రజలను ఆకర్షించలేకపోతున్నారని ములాయం పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అయితే తనయుడి పాలనపై ములాయం అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+