బాలికపై జవాన్ అత్యాచారయత్నం: బిటెక్ విద్యార్థి మృతి
ఆ తర్వాత టిక్కెట్ కలెక్టర్(టిసి)కి సమాచారం అందించారు. దీంతో బోగిలో ఉన్న భద్రతా సిబ్బంది సదరు జవానును అదుపులోకి తీసుకున్నారు. రైలు విజయవాడకు చేరుకున్నాక అతనిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. నిందితుడిని క్లెమెంట్గా గుర్తించినట్లు సమాచారం. బాలిక తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.
హైదరాబాదులో బిటెక్ విద్యార్థి మృతి
మొహిదీపట్నంలో ఆర్టీసీ బస్సు ఎక్కుతూ ప్రమాదవశాత్తూ కిందపడి ఉమర్ అనే బిటెక్ విద్యార్థి మృతి చెందాడు. అతని స్వస్థలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని సమాచారం.
వరంగల్లో తొమ్మిదేళ్ల బాలిక అదృశ్యం
వరంగల్ జిల్లాలో తొమ్మిదేళ్ల బాలిక అదృశ్యమైంది. హన్మకొండలోని సుబేదారిలో ఉంటున్న స్వర్ణలత అనే తొమ్మిదేళ్ల బాలిక ఉదయం నుండి కనిపించడం లేదు. ఆయితే ఈమె కిడ్నాప్కు గురైనట్లుగా అనుమానిస్తున్నారు.