గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైవాహికేతర సంబంధం: భార్యను కత్తితో చీరేసిన భర్త

By Pratap
|
Google Oneindia TeluguNews

Guntur District
గుంటూరు/ ఏలూరు: ఓ వ్యక్తి తన భార్యను కత్తితో చీరేసిన సంఘటన గుంటూరులోని శ్రీనివాస నగర్‌లో జరిగింది. వైవాహికేతర సంబంధం ఉందనే అనుమానంతోనే అతను తన భార్య ఉమా మహేశ్వరిపై దాడి చేసినట్లు చెబుతున్నారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం గుంటూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గత ఆరు నెలలుగా హెచ్చరిస్తున్నా వినకపోవడంతో అతను ఈ దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు.

అతను ఓ సెలూన్‌లో పనిచేస్తున్నాడు. సెలూన్‌లో వాడే కత్తితో భార్యను చీరేశాడు. ముఖంపై, ఛాతీపై తీవ్రంగా గాయాలయ్యాయి. గుర్తు పట్టలేని స్థితికి ఆమె చేరుకుంది. అతన్ని ఆపడానికి స్థానికులు భయపడ్డారు. గాయపడిన ఆమెను ఆస్పత్రికి చేర్చడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ఓ మహిళ ధైర్యం చేసి ఆమెను ఆస్పతికి తీసుకుని వెళ్లింది.

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థి మరణించాడు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న వీరవెల్లి రాజేష్ బాబు అనే పాతికేళ్ల యువకుడు కళాశాలకు మోటార్ బైక్‌పై వెళ్తూ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు.

రాజేష్ బాబు తలకు తీవ్రమైన గాయం అయింది. విజయవాడ ఆస్పత్రికి తరలిస్తుండగా అతను మార్గమధ్యంలోనే మరణించాడు. అతని తమ్ముడు దేవాకాంత్ కూడా అదే వాహనం మీద ఉన్నాడు. తీవ్రంగా గాయపడిన దేవాకాంత్‌ను ఏలూరు ఆశ్రమ ఆస్పత్రికి తరలించారు.

English summary
A person has attacked his wife with knife, suspecting extra marital relation at Guntur. She is admitted into Guntur hospital. In another incident an engineering college student succumbed to injuries in West Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X