వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందీ నేర్పిన జుందాల్‌ను ఈజీగానే గుర్తు పట్టిన కసబ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ajmal Kasab
న్యూఢిల్లీ: దాదాపు నాలుగేళ్ల క్రితం 26/11 ముంబయిలో కాల్పులు జరిపిన ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్, సూత్రదారుల్లో ఒకరైన అబు జుందాల్‌ను ముంబయి పోలీసులు గురువారం ముఖాముఖిగా కూర్చోబెట్టారు. ముంబయి ముట్టడిలో కసబ్ నేరుగా పాల్గొన్న హంతకుడు. ఈ కుట్రకు సూత్రధారుల్లో ఒకడు జుందాల్. ముంబయి పోలీసులు వీరిద్దరిని ఆర్థర్ రోడ్ జైలులో కూర్చోబెట్టారు.

ఇద్దరినీ కలిపి ప్రశ్నించారు. జుందాల్‌ను కసబ్ ఈజీగానే గుర్తుపట్టాడు. ముంబై ముట్టడి కుట్రదారుల్లో జుందాల్ కూడా ఉన్నాడని కసబ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. లష్కరే తాయి బా ఉగ్రవాది జుందాల్‌ను ఈ ఏడాది మేలో పోలీసులు పట్టుకున్నారు. జుందాల్ చెప్పిన విషయాలపై కసబ్ నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కసబ్‌ను జుందాల్‌ను కలిపి ప్రశ్నిస్తున్నారు.

జుందాల్‌ను కసబ్ ఈజీగానే గుర్తు పట్టాడని ముంబయి పోలీసు ఒకరు చెప్పారు. వీరిద్దరినీ ముఖామఖిగా ముంబయి క్రైం బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్‌లో విచారించినట్లు చెప్పారు. తమ పదిమందికి ఇతనే హిందీ నేర్పించాడని కసబ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా లక్ష్య నిర్దేశన పైన కూడా పాఠాలు చెప్పాడని తెలుస్తోంది. వీరిద్దరిని ఎదురుగా ఉంచి విచారించేందుకు రాష్ట్ర హోంశాఖ అనుమతించింది.

English summary
Nearly three years after the 26/11 Mumbai terror attack, Ajmal Kasab, the lone surviving attacker, was on Aug 9 brought face to face with Abu Jundal whom he identified as one of the main conspirators of the mayhem, Mumbai police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X