వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాన్‌లో రెండు భారీ భూకంపాలు: 250మంది మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rescuers dig for survivors after quakes kill 250 in Iran
టెహ్రాన్: ఇరాన్‌లో వచ్చిన భారీ భూకంపకాలతో సుమారు రెండు వందల యాభై మంది వరకు చనిపోయారు. ఇరాన్‌లోని ఈశాన్య ప్రాంతంలో రెండు భారీ భూకంపకాలు వచ్చాయి. ఈ ఘటనలో 250 మంది మృతి చెందడంతో పాటు రెండు వేలకు పైగా ప్రజలు గాయపడ్డారు. ఇరాన్‌లోని అజెర్ బైజాన్ ప్రాంతంలోని తాబ్రిజ్ నగరానికి అరవై కిలోమీటర్ల దూరంలో పదకొండు నిమిషాల వ్యవధిలో ఈ రెండు భూకంపాలు సంభవించాయి.

రిక్టర్ స్కేలు పైన 6.2, 6.0గా నమోదయ్యాయి. భూకంప కేంద్రం రాజధాని నగరం టెహ్రాన్‌కు సుమారు ఐదు వందల కిలోమీటర్ల దూరంలోని అహర్, హరీస్, ప్రాంతాలలో గుర్తించారు. ఈ రెండు భూకంప కేంద్రాలు భూమికి పది కిలోమీటర్ల లోతులో నమోదయ్యాయి. చాలా గ్రామాలు ధ్వంసమయ్యాయి. వేలాది మంది గాయపడ్డారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. గాయపడ్డ వారిని తాబ్రీజ్, అర్దెబిల్ ఆసుపత్రులకు తరలించారు.

భూకంప ప్రకంపనలతో జనం భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనల దాటికి అహర్, హరీస్, వర్జాఖాన్ పట్టణాలు అతలాకుతలమయ్యాయి. అరవై గ్రామాలు పూర్తిగా, పాక్షికంగా తుడిచి పెట్టుకు పోయాయి. మహిళలు, పిల్లల మృతదేహాలు గుంపులుగా పడి ఉన్నాయి. తాబ్రిజ్ నగరంలో భవనాలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి.

English summary
Grieving women wailed over dozens of bodies of dead relatives and men armed with shovels dug frantically for survivors today, in the wake of twin earthquakes in northwest Iran that killed at least 250 people and injured 2,000.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X