మణిపూర్‌లో నాలుగు వరుస పేలుళ్లు: సిఎం జిల్లాలోనే

Bomb Blasts
ఇంఫాల్: ఈశాన్య ప్రాంతంలోని మణిపూర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాష్ట్ర రాజధానితో పాటు తౌబాల్‌లోని ఓ ప్రాంతంలో నాలుగు పేలుళ్లు జరిగాయి. ఇంపాల్‌లో వరుసగా మూడు, తౌబాల్‌లో ఓ పేలుడు జరిగింది. ఇది ఉగ్రవాదుల చర్యగా భావిస్తున్నారు. పేలుళ్లు జరిగింది ముఖ్యమంత్రి ఓక్రాం సొంత జిల్లా కావడం గమనార్హం. అదీకాకుండా ఓ వైపు భారత్ 66వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటుండగా ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి.

ఇంఫాల్‌లోని మణిపూర్ రైఫిల్స్ బెటాలియన్ సమీపంలో ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీంతో చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలు భయకంపితులయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు పలు చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నారనే ఇంటెలిజెన్స్ వర్గాల వ్యాఖ్యలు నిజమయ్యాయి. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనిని పోలీసులు ధృవీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+