మంత్రుల ద్వారా జగన్ను కాపాడేందుకే: కిరణ్పై టిడిపి

మంత్రి వట్టి వసంత్ కుమార్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని టిడిపి సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, ఇనుగాల పెద్దిరెడ్డిలు వేరుగా అన్నారు. ధర్మాన ప్రసాద్ రాజీనామాను ఆమోదిస్తే ప్రభుత్వం కుప్పకూలుతుందనే భయం కిరణ్కు పట్టుకుందన్నారు. అందుకే ఆయన రాజీనామాను ఆమోదించడం లేదన్నారు. దోషులైన మంత్రులకు ఇతర మంత్రులు వత్తాసు పలకడం శోచనీయమన్నారు. రాజ్యాంగం ప్రకారం తీసుకునే కేబినెట్ నిర్ణయాలకు అందరిదీ బాధ్యత ఉంటుందన్నారు.
సిబిఐ విచారణ నుండి తప్పించుకునేందుకు మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డిపై ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని, తమపై వచ్చిన ఆరోపణలపై మంత్రులు ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. మంత్రులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ఎ-5 నిందితుడిగా ఉన్న ధర్మాన రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. ఆయన రాజీనామాను ఆమోదించి ప్రాసిక్యూషన్కు అనుమతించాలని డిమాండ్ చేశారు.
కిరణ్ కుమార్ ధర్మానను వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. జగన్ కేసులో రాష్ట్ర సంపదను దోచేయడానికి మంత్రులు ఉమ్మడి బాధ్యతను సాకుగా చూపిస్తున్నారని, మంత్రిమండలి తల్చుకుంటే రాష్ట్రాన్ని కూడా అమ్మేయవచ్చుననే విధంగా వట్టి మాటలు ఉన్నాయన్నారు. ధర్మానను సిబిఐ విచారించేందుకు అనుమతించాలని, అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications