టిఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్, పిఎస్‌లో హరీష్‌‌రావు ధర్నా

Harish Rao - Etela Rajendar
హైదరాబాద్: విద్యుత్ కోతలను నిరసిస్తూ హైదరాబాదులోని విద్యుత్ సౌధ వద్ద ధర్నాకు దిగిన తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విద్యుత్ కోతతో సామాన్యులు, రైతులు నానా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు ఆధ్వర్యంలో విద్యుత్ సౌధ వద్ద ఉదయం పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

వారు విద్యుత్ సౌధలోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసు, ఎమ్మెల్యేల వద్ద కాసేపు వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ ఇస్తామని ట్రాన్సుకో సిఎండి మాట తప్పారని ఆరోపించారు. వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ ఇస్తామని సిఎండి రాతపూర్వకంగా లేఖ రాసిచ్చి కూడా దానిని తప్పారని మండిపడ్డారు.

సీమాంధ్రలో విద్యుత్ కోత అంతగా లేదని కానీ తెలంగాణలోనే ఎక్కువ విద్యుత్ కోతలు ఉన్నాయన్నారు. తెలంగాణపై ఎందుకు కక్ష అని మండిపడ్డారు. ఈ సమయంలో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో హరీష్ రావు కింద పడ్డారు. పోలీసులు తెరాసను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అయినా వారు తగ్గక పోవడంతో వారిని అరెస్టు చేసి బొల్లారం పోలీసు స్టేషన్ తరలించారు. ఎమ్మెల్యే వినయ భాస్కర్ మాత్రం పోలీసుల కళ్లుగప్పి విద్యుత్ సౌధలోకి చొచ్చుకు పోయారు.

తెలంగాణ ప్రాంత రైతులకు ఏడు గంటల విద్యుత్ ఇచ్చే వరకు తాను నిరాహార దీక్ష చేస్తానని బొల్లారం పిఎస్ వద్ద హరీష్ రావు ప్రకటించారు. ఆయన పిఎస్‌లోనే దీక్ష ప్రారంభించారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు తాను దీక్షను కొనసాగిస్తానని చెప్పారు. కాగా విద్యుత్ సమస్యపై తెలుగుదేశం పార్టీ బృందం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మధ్యాహ్నం మూడు గంటలకు కలవనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+