వైయస్ అండతో జగన్ దోపిడి, బయట పెట్టండి: విహెచ్

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తన భర్త, అత్త చనిపోయినా ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారని, ప్రధాని పదవి పలకరించినా తీసుకోని త్యాగశీలి అన్నారు. కానీ జగన్ మాత్రం పదవి కోసం పార్టీ పెట్టాడన్నారు. వైయస్ హయాంలో జరిగిన గుట్టును మంత్రులు విప్పాలన్నారు. వారికి ఇప్పటికైనా జ్ఞానోదయం అయినందుకు సంతోషంగా ఉందన్నారు. తమకు దస్తావేజులు పంపి ఫోన్లు చేశారని వారు చెబుతున్నారని, ఎవరి వద్ద నుండి ఫోన్లు వచ్చాయో చెప్పాలన్నారు.
తాము ఏ తప్పు చేయలేదని మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్దకు వెళ్లి ఆవేదన వ్యక్తం చేశారని, అయితే లబ్ధి పొందింది ఎవరో మాత్రం చెప్పక తప్పదన్నారు. వైయస్ బొమ్మ కాంగ్రెసుకు అవసరం లేదని, ఆ పేటెంట్ను జగన్ తీసుకున్నారని, కాబట్టి కాంగ్రెసు ఇక నుండి కేవలం సోనియా గాంధీ బొమ్మనే ఉపయోగించాలన్నారు. అప్పుటి వాటికి మంత్రులు ఇప్పుడు అనుభవిస్తున్నారన్నారు. మంత్రి ధర్మాన ప్రసాద రావు రాజీనామా అంశంపై జాప్యం వద్దన్నారు.
రాజీనామా వ్యవహారంతో అధిష్టానానికి సంబంధం లేదని, ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన నిర్ణయమన్నారు. ధర్మాన తాను నైతికత కోసమే రాజీనామా చేసినట్లు చెబుతున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణాల వారు కూడా తమకు మద్దతిచ్చే రోజు వస్తుందని, తమ వైపు బిసిలు ఉన్నారు కాబట్టే వారిని ఆకర్షించేందుకు వైయస్ విజయమ్మ వంద సీట్ల ప్రకటన చేశారన్నారు. దివంగత వైయస్ పైన తనకు వ్యక్తిగతంగా ఎలాంటి కక్ష లేదన్నారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications