వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూయార్క్ దుండగుడి కాల్పులు: ఇద్దరు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

US Flag
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో గల ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ సమీపంలో ఒక ఆగంతకుడు శుక్రవారం ఉదయం తుపాకితో కాల్పులు జరపడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. దుండగుడు జరిపిన కాల్పులలో మరి ఇద్దరు గాయపడినట్టు తెలుస్తున్నది.

న్యూయార్క్‌లో స్థానిక కాలమాన ప్రకారం ఉదయం తొమ్మిది గంటల వేళ, అందరూ కార్యాలయాలకు పరుగులు తీస్తున్న సమయంలో దుండగుడు కాల్పులు జరపడంతో ఇద్దరు మరణించారు. ఎనిమిది మంది గాయపడ్డారు. ఈలోగా పోలీసులు ఆ వ్యక్తిపై కాల్పులు జరపగా, అతడు అక్కడికక్కడే మరణించాడు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వైపు వాహనాల రాకపోకలను పక్కకు మళ్లించారు.

తమకు కాల్పుల శబ్దం వినిపించిందని, ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు వాహనాలను ఆపేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎంపైర్ బిల్డింగ్ సమీపంలోని ప్రాంతంలోకి పోలీసులు, ఫెడరల్ ఏజెన్సీ అధికారులు దిగడంతో ఫిప్త్ ఎవెన్యూను పాక్షికంగా మూసేశారు. అమెరికాలో ఇది అత్యంత పర్యాటక ఆసక్తి గల ప్రాంతం.

ఈ సంఘటనతో పర్యాటకులు తీవ్ర ఆందోళనకు, దిగ్భ్రాంతికి గురయ్యారు. అమెరికాలో ఆగంతకుల కాల్పులు ఇటీవలి కాలంలో సాధారణంగా మారినట్లు కనిపిస్తోంది. ఇటీవల రెండు విచక్షణారహిత కాల్పుల సంఘటనలు చోటు చేసుకున్నాయి. బ్యాట్‌మన్ సినిమా ది డార్క్ రైట్ రైజెస్ ప్రదర్శన సందర్భంగా జులై 20వ తేదీన ఓ సాయుధుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 12 మంది మరణించారు, 58 మంది గాయపడ్డారు. ఆగస్టు 5వ తేదీన సిక్కు ఆలయం వద్ద ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. ముగ్గురు గాయపడ్డారు.

English summary
A gunman opened fire at tourists outside the Empire State Building in New York, killing at least 2 of them and injuring 8 others. The suspect was shot dead too, New York Police Department said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X