ఎన్టీఆర్ విగ్రహం: టిడిపిపై పురంధేశ్వరి నెపం, ఫ్యామిలీలో
దీంతో విశాఖలో పర్యాటక, ఐటి రంగాలు అభివృద్ధి చెందుతాయన్నారు. వారానికి మూడు రోజులు మూడు గంటలు ల్యాండింగ్ సమయం పెరిగిందన్నారు. దీంతో రాత్రి ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు ల్యాండింగ్కు అనుమతి లభించిందన్నారు. ఇక నుండి విశాఖపట్నం విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాలు వస్తాయన్నారు. అక్టోబర్ 1వ తేది నుండి నైట్ ల్యాండింగ్కు కేంద్రం అనుమతించిందన్నారు. పార్లమెంటు ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటును అడ్డుకుంది టిడిపియే అన్నారు. తాను విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. కుటుంబం లిస్టులో తన పేరు ఎందుకు లేదో తనకు తెలియదన్నారు.
రాష్ట్రంలో పిసిసి చీఫ్, ముఖ్యమంత్రి బాధ్యతలను మరొకరికి అప్పగిస్తారని తాను భావించడం లేదని కేంద్రమంత్రి పళ్లం రాజు అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా, బొత్స సత్యనారాయణ పిసిసి చీఫ్గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రంలో బ్రహ్మాండమైన నాయకత్వం ఉండగా మార్పు ప్రచారం ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.