షిండేతో తెలంగాణపై చర్చించలేదు: దామోదర

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్పై తాను షిండేకు వివరించినట్లు, దానికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరాన్ని చెప్పినట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై నిర్ణయం వస్తుందనే విషయంపై తనకు ఏ విధమైన సమాచారం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర నాయకత్వ మార్పుపై ఎవరికైతే ఆశ ఉందో వారినే ఆడగాలని ఆయన మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ఆ తర్వాత ఆయన రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనీతో సమావేశమయ్యారు.
సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు కూడా సుశీల్ కుమార్ షిండేను కలిశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్ పదవి తన దక్కలేదని అసంతృప్తిగా ఉన్నట్లు తనపై వార్తలు వస్తున్న నేపథ్యంలో రాయపాటి షిండేతో సమావేశమయ్యారు.
పార్టీ ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా తాను కాంగ్రెసు పార్టీతోనే ఉంటానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పనితీరును పార్టీ అధిష్టానం అంచనా వేస్తోందని ఆయన చెప్పారు. కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకోవడానికి కసరత్తు చేస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు షిండేను కలుసుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.












Click it and Unblock the Notifications