మద్రాసు రాష్ట్రంలో ఉంటేనే బాగుండేది: టిజి వెంకటేష్
రాయలసీమ శాసనసభ్యులతో చర్చించి, ఈ ప్రాంత సమస్యలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలియజేస్తామని, రాయలసీమ హక్కులను నెరవేరుస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. సమస్యలను ముఖ్యమంత్రి ముందు ఉంచడానికి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాయలసీమ ప్రాంతం రాజధానిని కోల్పోయిందని ఆయన అంటూ ఇంకా ఎన్ని దెబ్బలు తినాలని అడిగారు.
సాగునీటి ప్రాజెక్టులపై చర్చించడానికి బుధవారం భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై సమావేశంలో చర్చించారు. ఇప్పటి వరకు ప్రాజెక్టులపై ఎంత ఖర్చు చేశాం, ఎంత అవసరం అనే విషయాలపై చర్చించింది. సాగునీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు మరోసారి సమావేశమవుతామని సుదర్శన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు.
ప్రస్తుతం 50 శాతం, 75 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టులపై దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. 75 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టులకు మరో పది వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఆయన అన్నారు.