స్పీడ్కు బ్రేక్స్: దానం, వైయస్పై అవాకులు.. కోమటిరెడ్డి

గాంధీ భవన్తో పాటు పంజాగుట్టలోని వైయస్ విగ్రహానికి వారు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి దానం నాగేందర్ మాట్లాడారు. వైయస్ వల్లే రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెసు రెండోసారి అధికారంలోకి వచ్చిందని చెప్పారు. యువజన కాంగ్రెసు నేత సుధాకర్ బాబుకు స్పీడు ఎక్కువైందని, దానికి బ్రేకులు పడతాయన్నారు. వైయస్ పేరును కాంగ్రెసు మర్చిపోవాలనే అభిప్రాయం సరికాదన్నారు. వైయస్ లేని లోటు పూడ్చలేనిదని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్న వైయస్ కలను తాము నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు.
వైయస్ ఆశయ సాధనే ఆయనకు తామిచ్చే ఘనమైన, నిజమైన నివాళీ అన్నారు. తెలుగుదేశం పార్టీ నేత దాడి వీరభద్ర రావు తనపై ఎవరూ దాడి చేయకుండా చూసుకోవాలని హితవు పలికారు. దివంగత వైయస్ను తక్కువ చేయడం మంచిది కాదని కోమటిరెడ్డి వెంకట రెడ్డి నల్గొంజ జిల్లాలో అన్నారు. వైయస్ పైన కొందరు అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఎంతమంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ వైయస్ తనను చిన్న వయస్సులోనే ఎమ్మెల్యేని, మంత్రిని చేశారన్నారు. వైయస్ పథకాలకు పేర్లు మారిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు.
పార్టీలో యువనాయకత్వాన్ని బలపరచిన నేత వైయస్ అన్నారు. నల్గొండ జిల్లాలో వైయస్ అతిపెద్ద ఆసుపత్రి కోసం కృషి చేశారని, జిల్లాను ఫ్లోరైడ్ నుండి రక్షించడానికి వైయస్ ప్రయత్నాలు చేశారన్నారు. జిల్లా ప్రజలు వైయస్కు రుణపడి ఉంటారన్నారు. కాగా హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో బొత్స, కిరణ్తో పాటు మంత్రులు దానం నాగేందర్, కాసు వెంకట కృష్ణా రెడ్డి, వట్టి వసంత్ కుమార్, ఎంపీలు కెవిపి రామచంద్ర రావు, అంజన్ కుమార్ యాదవ్, ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications