టెక్కీ ఆత్మహత్య: భర్త బంధువులపై భార్య నిందలు
తన భర్త మృతి విషయాన్ని తనకు సకాలంలో తెలియజేయలేదని, ఇందులో అనిల్ సోదరి, బావ పాత్ర అనుమానాస్పదంగా ఉందని స్పప్న సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పింది. హైదరాబాదులోని ఇంటలిజెన్స్ బ్యూరోలో సురేషథ్ ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు.
సంఘటన జరిగిన సమయంలో స్పప్న నల్లగొండ జిల్లా కోదాడలోని తన తల్లిదండ్రుల నివాసంలో ఉంది. ఆదివారం రాత్రి హైదరాబాదుకు వచ్చింది. తన భర్త మరణ వార్తను తనకు సాయంత్రం 4.15 గంటలకు తెలియజేశారని ఆమె చెప్పింది. తన భర్త బావ, సోదరి పాత్రపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది.
అయితే, తమకు ఏ విధమైన ఫిర్యాదు అందలేదని పోలీసులు అంటున్నారు. విషం తీసుకోవడం వల్ల అనిల్ మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైందని పోలీసులు అంటున్నారు. తమకు సూసైడ్ నోట్ కూడా దొరికిందని, అనిల్ భార్య నుంచి తమకు ఏ విధమైన ఫిర్యాదు అందలేదని వారు చెబుతున్నారు.
తమ కుమారుడు వైవాహిక జీవితంతో ఆనందంగా లేడని, అతని ఆత్మహత్యకు అదే కారణమని అనిల్ తల్లిదండ్రులు చెప్పారని, పెళ్లి సమయంలో స్వప్న కుటుంబ సభ్యులు 25 లక్షల రూపాయలు ఇచ్చారని, వాటిని తిరిగి ఇచ్చేయడానికి అనిల్ కుటుంబ సభ్యులు అంగీకరించారని అంటున్నారు. దాంతో ఇరు పక్షాల మధ్య రాజీ కుదిరినట్లు సమాచారం. అనిల్ కుమార్ శవాన్ని ఆదివారంనాడు అతని తల్లిదండ్రులకు అప్పగించారు.