ఈనెలలోనే తెలంగాణ తేలుతుంది, ఢిల్లీలో చర్చ: కెసిఆర్
సెషన్స్కు మిస్ కావొద్దన్న ఉద్దేశ్యంతో చివరి రెండు రోజులు హాజరయ్యేందుకు వెళుతున్నానని చెప్పారు. ఈ నెలాఖరులోగా తెలంగాణపై ఏదో ఒకటి తేలుతుందని కెసిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయన్నారు. ఢిల్లీలోతెలంగాణపై ఏదైనా జరిగే అవకాశముందని, తాను అక్కడ ఉండే సమయంలో చర్చలు జరిగే ఆస్కారముందన్నారు. తెలంగాణపై నెలాఖరులోగా మాత్రం తేలడం ఖాయమన్నారు.
ఆజాద్ను కలిసిన జెఏసి
కాగా న్యూఢిల్లీలో కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ను తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి నేతలు కలిశారు. గత సంవత్సరం జరిగిన సకల జనుల సమ్మె సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తాము ఆజాద్ను కోరినట్లు జెఏసి నేతలు తర్వాత చెప్పారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని తాము అతనికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. జెఏసి నేతలతో పాటు ఎంపీలు రాపోలు ఆనంద భాస్కర్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డిలు కూడా ఆజాద్ను కలుసుకున్నారు.
తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆజాద్... ఎంపీలతో, జెఏసి నేతలతో రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణకు జరిగిన అన్యాయంపై గణాంకాలతో కూడిన ఓ రిపోర్ట్ ఇవ్వాలని సూచించినట్లుగా తెలుస్తోంది. కాగా ఆజాద్ నివేదిక కోరడం చర్చనీయాంశమైంది.