50పెళ్లిళ్ల కిలాడీ మళ్లీ అరెస్ట్కు..: జైళ్లో చనువుగా
ఈ మేరకు కోర్టు అనుమతులు కోరుతూ మంగళవారం శ్రీ పెరంబదూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే జైలులో ఉంటున్న షెహనాజ్ బెయిల్ కోరిన విషయం తెలిసిందే. గర్భవతిని అయిన తనకు మానవతా దృక్పథంతో బెయిల్ ఇవ్వాలని ఆమె కోర్టును కోరింది. మరోవైపు యువకులను ప్రేమ వలలో పడేసి ఆడంబర జీవితాన్ని గడిపిన షెహనాజ్ ప్రస్తుతం జైలులో సాధారణ ఖైదీగా కొనసాగుతోంది.
తోటి మహిళా ఖైదీలు భోజనం చేసే ఆహారాన్నే ఆమె తీసుకుంటోంది. అందరితోనూ చనువుగా ఉంటున్న షెహనాజ్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంటున్నట్లుగా తనకు ఐదు గురు భర్తలేనని చెబుతోందని సమాచారం. ప్రస్తుతం షెహనాజ్ ఆరునెలల గర్భవతి కావడంతో ఆమెకు వైద్యులు ప్రతిరోజు వైద్య పరీక్షలు చేస్తున్నారు.
తాను కేవలం నలుగురిని మాత్రమే వివాహమాడానని, యాభై మందిని కాదని నిత్య పెళ్లి కూతురు కిలాడీ లేడీ షహనాజ్ అరెస్టు తర్వాత పోలీసులకు తెలిపింది. తాను కేవలం డబ్బు, విలాస జీవితం కోసమే ప్రేమ నాటకాలు ఆడినట్లు చెప్పుకొచ్చింది. వేర్వేరు నెంబర్లను కలిగి వున్న కారణంగా ఎవరికీ తనపై అనుమానం రాలేదని, అయితే స్నేహాలు ఎక్కువ కావడంతో బయటపడాల్సి వచ్చిందని వాపోయింది. బెంగుళూరుకు పారిపోకముందు తాను ఆంధ్ర, కేరళ ప్రాంతాలలో తలదాచుకున్నట్టు తెలిపింది. ఆమెను మెజిస్టిక్ బస్ స్టేషన్ సమీపంలో పోలీసులు ఈ నెల 1న అరెస్టు చేశారు.