బస్సును ఢీకొట్టి ఆత్మహత్య, ప్రేయసిపై అనుమానంతో
ప్రియురాలిపై అనుమానంతో తన ప్రాణాలు తీసుకోవడమే కాకుండా ఆమె ఉసురు కూడా తీశాడు. ఆమెను బైకు మీద ఎక్కించుకుని వేగంగా వెళ్లి, బస్సును ఢీకొట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం వెంపరాల గ్రామానికి చెందిన మాదల సైదుబాబు గుంటూరుజిల్లా ఫిరంగిపురం సమీపంలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేశాడు. అప్పట్లో సహ విద్యార్థిని శివకృష్ణజా రెడ్డిని ప్రేమించాడు.
చదువు పూర్తయ్యాక సైదుబాబు చెన్నైలో ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత వీరిమధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. తనపై ప్రేమ నటనని, ఆమె మరికొందరిని ప్రేమిస్తోందని అతడికి అనుమానం వచ్చింది. అంతే, ఉద్యోగం మానేసి గుంటూరుకు చేరుకున్నాడు. స్నేహితుడి మోటార్ సైకిల్పై శివకృష్ణజను తీసుకుని కాలేజీకి వెళ్లి.. వస్తూ.. ఈ దారుణానికి పాల్పడ్డాడు. అంతకుముందే సూసైడ్ నోట్రాసి జేబులో పెట్టుకున్నాడు. అందులో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులను ఉద్దేశించే కాదు.. పోలీసులను, బస్సు డ్రైవర్ను ఉద్దేశించి కూడా రాశాడు.
"అమ్మ, అక్క, తమ్ముడు, చెల్లెలు, మా మయ్య, తాతయ్య, బాబాయిలు, చిన్నమ్మలు.. మీ అందరినీ వదిలి వెళ్లిపోతున్నాను. నన్ను క్షమించండి'' అని రాశాడు. పోలీసులను ఉద్దేశించి.. "పోలీస్ సర్స్కి నాది చిన్ని రిక్వెస్ట్. ప్లీజ్ నన్ను డైరెక్ట్గా మా హోమ్కి డెలివరీ చేయండి'' అని పేర్కొన్నాడు. తనకు తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టమని, తన సమాధి పక్కన పార్టీ జెండా పెట్టాలని కోరుకున్నాడు. బస్సు డ్రైవర్ను ఉద్దేశించి "డ్రైవర్గారూ నన్ను క్షమించండి. నేను చనిపోవాలని మీ వాహనాన్ని ఢీకొట్టాను. నాకు బతకడం ఇష్టం లేదు'' అని రాశాడు. తన ను క్షమించమని ప్రియురాలి తండ్రిని ఆ లేఖలో వేడుకున్నాడు.