వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

23 మంది ఇండియన్స్‌తో కూడిన నౌక హైజాక్, విడుదల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hijacked Ship
అబుజ: సముద్ర దొంగలు మళ్లీ చెలరేగిపోయారు. నైజీరియా జలాల్లో ఓ నౌకను హైజాక్ చేశారు. 24 గంటల అనంతరం బుధవారం విడిచి పెట్టారు. ఆ నౌకలోని 23 మంది భారత నావికులు సురక్షితంగా ఉన్నారు. గట్టి భద్రత నడుమ వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. గినియా జలసంధి సమీపంలో సముద్ర దొంగలు ఇలా దాడులకు పాల్పడటం రెండు వారాల్లో ఇది మూడోసారి.

సింగపూర్‌కి చెందిన ఎంటి అబుధాబి స్టార్ అనే ఓడ ఆయిల్‌ను తీసుకెళ్తుండగా మంగళవారం సాయంత్రం హైజాక్‌కు గురైందని ఇంటర్నేషనల్ మారిటైమ్ బ్యూరో(ఐఎంబి) అధికారులు తెలిపారు. సముద్ర దొంగలు దాడి చేసినట్టుగా సిబ్బందిలో ఒకరు సమాచారం అందించారని ఆయిల్ ట్యాంకర్ కంపెనీ ప్రతినిధి తెలిపారు.

హైజాక్‌కు పాల్పడింది నైజీరియాలోని నైజర్ డెల్టా ప్రాంతానికి చెందిన చమురు దొంగలుగా అనుమానిస్తున్నారు. ఈ నౌక గ్యాసోలీన్ అనే ఇంధనాన్ని తీసుకు వెళుతుండగా గినియా జలసంధి సమీపంలోని లాగోస్ సముద్ర జలాల్లో నైజీరియన్ పైరేట్లు హైజాక్ చేశారు. వీరిని రక్షించింది నైజీరియన్ నౌకా దళ సిబ్బందే.

English summary
An oil tanker with 23 Indian sailors onboard that was hijacked by pirates off the shore of Nigeria was rescued by the Nigerian Navy on Wednesday afternoon, a shipping ministry official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X