చైనాలో భూకంపం: 50 మంది మృతి, విధ్వంసం

ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది. ఝావోటోంగ్ నగర కేంద్రానికి 33 కిలోమీటర్ల దూరంలోని లుయజోహె కేంద్రంగా భూకంపం వచ్చింది. యిలియాంగ్లో 49 మంది మరణించగా, ఝవోటోంగ్లో ఒకరు మరణించినట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరగవచ్చునని భావిస్తున్నారు. సహాయక బృందాలు భూకంపం తాకిన మరిన్ని గ్రామాలను చేరుకోవాల్సి ఉంది.
రోడ్లపై కొండ చరియలు విరిగి రాళ్లు పడడంతో కొన్ని గ్రామాలకు చేరుకోవడానికి సాధ్యం కావడం లేదు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విద్యుత్తు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బ తిన్నాయి. భూకంపం తర్వాత స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 16 ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
భూకంపం ప్రభావం ఏడు లక్షల మందిపై పడింది. దాదాపు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇరవై వేలకు పైగా ఇళ్లు పూర్తిగా కూలిపోవడమో, ధ్వంసం కావడమో జరిగింది.












Click it and Unblock the Notifications