"మహానాడు - 2026"పై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..!

తెలుగుదేశం పార్టీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా గుర్తింపు పొందిన "మహానాడు" ఈసారి పూర్తిగా కొత్త రూపంలో జరగనుంది. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించే ఈ మహాసభ, టీడీపీకి కేవలం రాజకీయ సమావేశం మాత్రమే కాదు.. పార్టీ భవిష్యత్ దిశను నిర్ణయించే అత్యంత కీలక వేదికగా నిలుస్తుంది. అయితే ఇంధన పొదుపు, సాంకేతిక వినియోగం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో ఈసారి మహానాడు 2026ను పూర్తిగా హైబ్రిడ్-ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని.. సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

కాగా వాస్తవానికి ఈ నెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరులో భారీ స్థాయిలో మహానాడు నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు కూడా ప్రారంభించింది. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులు, ఇంధన వినియోగంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యయ నియంత్రణ, విద్యుత్ ఆదా, ఇంధన పొదుపు వంటి అంశాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు అదే సందేశాన్ని పార్టీ కార్యక్రమాల ద్వారా కూడా ప్రజలకు చేరవేయాలని భావించింది.

ap-cm-chandrababu-naidu-shocking-decision-about-mahanadu-2026-by-conducting-it-online

దీంతో ఈ ఏడాది మహానాడును మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ కేంద్రంగా పూర్తిగా డిజిటల్ మోడ్‌లో నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ భవన్‌లో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి, అక్కడి నుంచే చంద్రబాబు, పొలిట్‌బ్యూరో సభ్యులు, కీలక నేతలు ప్రసంగించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,845 క్లస్టర్లలో భారీ ఎలక్ట్రానిక్ స్క్రీన్లు ఏర్పాటు చేసి కార్యకర్తలు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ స్థాయి వరకు పార్టీ నాయకత్వాన్ని టెక్నాలజీ ద్వారా అనుసంధానం చేయడమే ఈ హైబ్రిడ్ మహానాడు ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు.

1982లో ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవ నినాదంతో పార్టీని స్థాపించిన తర్వాత కార్యకర్తలతో ప్రత్యక్ష అనుసంధానం కోసం మహానాడు సంప్రదాయాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి మహానాడులో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ తీర్మానాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ కాలంలో భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచిన మహానాడు, చంద్రబాబు నాయకత్వంలో టెక్నాలజీ, పరిపాలనా సంస్కరణలు, డేటా ఆధారిత రాజకీయ వ్యూహాలకు కేంద్రబిందువుగా మారింది.

ఈసారి మహానాడులో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, యువత ఉపాధి, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, డిజిటల్ గవర్నెన్స్, గ్రీన్ ఎనర్జీ వంటి అంశాలపై ప్రత్యేక తీర్మానాలు ఆమోదించే అవకాశం ఉంది. అలాగే 2029 ఎన్నికల దిశగా పార్టీ వ్యూహాలపై కూడా కీలక చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడం, సోషల్ మీడియా విభాగాన్ని విస్తరించడం, యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక మహానాడులో పార్టీ కోసం కష్టపడ్డ సీనియర్ కార్యకర్తలకు సన్మానాలు, యువ నాయకులకు కొత్త బాధ్యతలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై ప్రకటనలు ఉండే అవకాశముంది. ప్రభుత్వ పనితీరుపై సమీక్షతో పాటు ప్రతిపక్షాల రాజకీయ వ్యూహాలపై కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారీ జనసమీకరణలతో జరిగే సంప్రదాయ మహానాడుకు బదులుగా, పూర్తిగా డిజిటల్ రూపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం భారత రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌కు నాంది కావచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+