రేప్ కేసులో ఇద్దరు పోలీసుల అరెస్టు, సిఐడి వెల్లడి
వీరిద్దరిని న్యాయస్థానంలో హాజరుపరిచి జైలుకు తరలించినట్లు రమణమూర్తి చెప్పారు. బాధిత మహిళది గుంటూరు జిల్లా వినుకొండ రెండో లైనులో మసీదు మన్యం ప్రాంతం. ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అప్పటి వినుకొండ ఎస్ఐ గన్మన్గా పనిచేస్తున్న ఓర్సు వెంకటేష్ విచారణకని వెళ్లి 2010 జులై 13వ తేదీ అర్థరాత్రి బాధిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ ఘటనపై వినుకొండ పోలీసు స్టేషనులో కేసు నమోదైంది. అయితే విచారణ చేయకుండానే పోలీసులు కేసును మూసివేసినట్లు సిఐడి దర్యాప్తులో వెల్లడైంది. నేరం జరిగినట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలడంతో సిఐడి పోలీసులు ఓర్సు వెంకటేష్ను అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను గుంటూరు జిల్లా క్రోసూరు పోలీసుల స్టేషనులో పనిచేస్తున్నాడు. అతడికి సహకరించాడనే ఆరోపణపై దాస్ను సర్వీసు నుంచి తొలగించారు.
తప్పుడు ఫిర్యాదు ఇచ్చావంటూ బాధిత మహిళను ప్రాసిక్యూట్ చేసే దాకా స్థానిక పోలీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. మహిళను అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరించి అత్యాచారానికి దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.