త్వరలో తెలంగాణపై నిర్ణయం, నేనూ చెప్పా: కిరణ్

Kiran Kumar Reddy
మహబూబ్ నగర్: త్వరలో తెలంగాణపై నిర్ణయం వెలువడుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం అన్నారు. ఆయన మహబూబ్ నగర్ జిల్లాలో ఇందిర బాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కిరణ్ పాలమూరులో యువతతో సంభాషించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కిరణ్ సమాధానమిచ్చారు.

ఒకరు తెలంగాణపై ప్రశ్నించగా.. కేంద్రం తెలంగాణపై త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తుందని చెప్పారు. తెలంగాణపై పార్టీ తరఫున స్పష్టమైన నిర్ణయాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని తాను కూడా పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు కిరణ్ చెప్పారు. పాలమూరు విశ్వవిద్యాలయానికి రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కిరణ్ ప్రకటించారు. తమ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో 3.2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కిరణ్ చెప్పారు.

కాగా శనివారం కూడా కిరణ్ తెలంగాణ అంశంపై స్పందించారు. తెలంగాణపై కేంద్రంలో జరగాల్సిన పని జరుగుతోందని, ఎవరు ఆందోళన చేయాల్సిన అవసరమే లేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. పేదలకు అందించాల్సిన సంక్షేమ పథకాలను పరిశీలించాల్సిన బాధ్యత తనపై ఉందని, తెలంగాణ కావాలంటూ ఆందోళనలు చేస్తే ఎక్కడ ఉన్న తెలంగాణ అక్కడే ఉంటుందని హితవు పలికారు. తెలంగాణపై జరగాల్సిన పనిని కేంద్రం జరిపిస్తూనే ఉందని, త్వరలోనే కీలక నిర్ణయం రానుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+