తెలంగాణ రాలేదు, మాట నిలబెట్టుకో: కెసిఆర్కు సురేఖ

ఓట్లు, సీట్లు కెసిఆర్ లక్ష్యమన్నారు. తెలంగాణపై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన వైఖరి ప్రకటించలేదని, కెసిఆర్ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే ముక్కు నేలకు రాయాలన్నారు. సెంటిమెంట్ను ఉపయోగించుకొని కెసిఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం అందరూ కలిసి ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
కెసిఆర్ నిజ స్వరూపాన్ని ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని సురేఖ అన్నారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు తాము దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కెవిపి డైరీ వైయస్ ప్రతిష్టను దిగజార్చేలా ఉందన్నారు.
కాగా కొద్ది రోజుల క్రితం జరిగిన ఉప ఎన్నికల సమయంలో తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు మాట్లాడుతూ... మూడు నెలల్లో తెలంగాణ ఖాయమని, అలా అని కేంద్రం నుండి తనకు సంకేతాలు ఉన్నాయని ప్రకటించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికల సమయంలో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ అప్పుడే ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికార కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇవ్వదని, కెసిఆర్ చెప్పినట్లుగా మూడు నెలల్లోగా తెలంగాణ రాకపోతే ఆయన ముక్కు నేలకు రాస్తారా అని సవాల్ విసిరారు. ఆయన చెప్పినట్లుగా ఖచ్చితంగా తెలంగాణ వస్తుందని చెబితే తాను ఉప ఎన్నికల బరిలో నుండి కూడా తప్పుకోవడానికి సిద్ధమని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications