ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అర్ధరాత్రి యువతిపై ముగ్గురు సామూహిక అత్యాచారం

By Srinivas
|
Google Oneindia TeluguNews

East Godavari Map
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. మోరంపూడి వద్ద ఓ యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బంధువుల ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరైన ఆ యువతి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో తన చిన్నాన్నతో కలిసి మోరంపూడికి బయలుదేరింది. వారిద్దరూ ఓ ఆటో ఎక్కారు.

కొద్దిదూరం వెళ్లిన తర్వాత ఆటో డ్రైవర్‌కు సంబంధించిన ఇద్దరు యువకులు ఆటో ఎక్కారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత వారు ఆ యువతి చిన్నాన్నను ఆటోలో నుండి కిందకు తోసేశారు. ముగ్గురు కలిసి ఆ యువతిని కొద్దిదూరం తీసుకు వెళ్లి అక్కడ సామూహిక అత్యాచారం చేశారు. యువతి చిన్నాన్న బొమ్మూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి బయలుదేరారు. తీవ్రంగా గాయపడిన యువతిని ఆసుపత్రిలో అత్యాచారానికి పాల్పడిన యువకులు తప్పించుకొని పారిపోయారు. పోలీసులు నిందితులను ముగ్గురిని పట్టుకోవడానికి స్థానిక ఆటో డ్రైవర్లను, పరిసర ప్రాంతాల వారిని విచారిస్తున్నారు.

ఖమ్మం జిల్లా లక్ష్మీపురం అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఒక యువతిపై అత్యాచారం చేసి హత్య చేశారు. హతురాలిది ఇల్లందు మండలం మాణిక్యవరానికి చెందిన పార్వతిగా గుర్తించారని తెలుస్తోంది.

English summary
A yoth allegedly killed a 14 year old girl in her house her on Saturday for not responding to his love for the last few months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X