మంత్రి జానారెడ్డిని కలిసిన కెసిఆర్ కూతురు కవిత
వారు తీసుకోలేదు మేం తీసుకోలేదు.. కోదండ
తెలంగాణ ప్రజల మనోభావాలను, అభిప్రాయాలను శ్రీకృష్ణ కమిటీ ఎప్పుడూ పరిగణలోకి తీసుకోలేదని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ వేరుగా అన్నారు. అందుకే తాము కూడా ఆ కమిటీని ఎప్పుడూ పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. తెలంగాణ కవాతు సమయంలో ఉద్యోగులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తి వేయాలని టిఎన్జీవో నేత విఠల్ డిమాండ్ చేశారు. లేదంటే తాము సమ్మె నోటీసులు ఇచ్చేందుకు సిద్దమన్నారు.
ట్యాంక్బండ్పై విగ్రహాల పునఃప్రతిష్ట
ట్యాంక్బండ్పై విగ్రహాల పునఃప్రతిష్టకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శుక్రవారం ఉదయం ధ్వంసమైన అన్నమయ్య, గురజాడ, వీరేశలింగం, కాటన్ విగ్రహాల ప్రతిష్ట చేయనుంది. అలాగే కొమరం భీమ్ విగ్రహం కూడా ట్యాంక్బండ్ ప్రతిష్టించనున్నారు. తెలంగాణ మిలియన్ మార్చ్ సందర్భంగా పలువురు ఆందోళనకారులు విగ్రహాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.