వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కావేరీ జలాల మంట: బెంగళూర్‌లో నిరసనల హోరు

By Pratap
|
Google Oneindia TeluguNews

Bangalore comes to a standstill, protesters hit streets
బెంగళూర్: కావేరీ ప్రకంపనలు కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో కనిపించాయి. బెంగళూర్‌లో శుక్రవారం సాధారణ జనజీవితం స్తంభించింది. ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చారు. తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయడాన్ని నిరసిస్తూ వివిధ కన్న సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళనకారులు వీధులకెక్కారు.

నగరంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. మధ్య, దక్షిణ బెంగళూర్‌ ప్రాంతాల్లో ఆందోళన ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లు చోటు చేసుకోవడంతో కార్యాలయాలకు వెళ్లేవారు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

బెంగళూర్‌లో ఉదయం పదకొండున్నర గంటలకు నిరసన ర్యాలీలు ప్రారంభమయ్యాయి. సామాజిక కార్యకర్తలు, స్వాములు, నటులు వీధుల్లోకి వచ్చారు. తన అనుచరులతో కలిసి మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప భారీ ర్యాలీ నిర్వహించారు. పలు రాజకీయ పార్టీల నాయకులు ర్యాలీల్లో పాల్గొన్నారు. జనతాదళ్ (ఎస్) నాయకులు కూడా ర్యాలీలు నిర్వహించారు. న్యాయవాదుల సంఘాలు కూడా నిరసనప్రదర్శనలకు మద్దతు తెలిపాయి.

కాగా, శనివారం రాష్ట్ర బంద్ తలపెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక కృష్ణా రాజసాగర్, కబిని డ్యామ్‌ల నుంచి తమిళనాడుకు 9 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తోంది. దీన్ని నిరసిస్తూ కర్ణాటకలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. కావేరీ రివర్ అథారిటీ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.

English summary

 India's IT hub Bangalore came to a standstill on Friday, Oct 5 as protesters hit the streets to vent out their anger. Protesters belonging to various Kannada groups are demanding to stop the release of Cauvery river water to the neighbouring state of Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X