అఫైర్పై ఆగ్రహంతో చెల్లెను హత్య చేసిన సోదరుడు
అంకిత్ (22), అతని కుటుంబ సభ్యులు లక్ష్మీశర్మ ఇంటికి ఫోన్ చేశారు. ఆమెను తీసుకెళ్లాల్సిందిగా చెప్పారు. రాత్రి పూట అలా ఎందుకు వెళ్లావని ఇంటికి వచ్చిన తర్వాత సుజీత్ చెల్లెతో గొడవకు దిగాడు. ఆగ్రహంలో సహనం కోల్పోయి వంటింట్లోని కత్తితో చెల్లెను నరికాడు. అంకిత్, లక్ష్మీశర్మల మధ్య ఆరు నెలల క్రితం పరిచయం కలిగింది.
వారిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. అయితే, పెద్దలు అందుకు వ్యతిరేకిస్తున్నారు. తాను తన తల్లిదండ్రులను కాదని లక్ష్మిని పెళ్లి చేసుకోలేనని అంకిత్ పోలీసులకు చెప్పాడు. మూడు నెలల క్రితం వారిద్దరి వ్యవహారం లక్ష్మి కుటుంబానికి తెలిసింది. కలుసుకోవద్దని లక్ష్మి కుటుంబ సభ్యులు అంకిత్ను హెచ్చరించారు. అయినా ఇద్దరు కలుసుకుంటూనే ఉన్నారు.
ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మిని తండ్రి రామ్ కుమార్ శరమ, నానమ్మ, సవతి తల్లి సునీత, నలుగురు తోబుట్టువులు, ఆంటీ కొట్టారు, ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే, సుజీత్ సహనం కోల్పోయి లక్ష్మిని కత్తితో పొడిచాడు. అమ్మాయిని వెంటనే లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రికి తరలించారు. మూడు గంటల పాటు ఆమెకు వైద్యులు చికిత్స చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. సుజీత్ను అరెస్టు చేయడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.