చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భర్త వద్దని, ప్రియుడితోనే వెళ్తానని కోర్టులో చెప్పిన భార్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Woman did not ready to go with husband
చెన్నై: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తనకు తన భర్తతో జీవించడం ఇష్టం లేదని చెప్పిన ఘటన తమిళనాడులో జరిగింది. తాను తన ప్రియుడితోనే జీవించాలని అనుకుంటున్నట్లుగా చెప్పింది. ఆదంబాక్కం మస్తాన్‌కోవిల్ వీధికి చెందిన ఇస్మాయిల్‌కు ఫాతిమాభానుతో కొన్నాళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఫాతిమాభాను రాయపురంలో ఉన్న తల్లి ఇంటికి వెళ్లి, వచ్చే సమయంలో అక్కడ ఉండే ఐజాక్‌తో ఏడాదిన్నర క్రితం పరిచయమైంది.

ఆ తర్వాత ఆగస్టులో ఆమె మాయమైంది. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెదికినా కనిపించలేదు. దీంతో భర్త ఆదంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐజాక్‌తో ఉన్న ఫాతిమాభానును అదుపులోకి తీసుకుని భర్తకు అప్పగించారు. కొన్ని రోజుల తర్వాత ఆమె మళ్లీ కనిపించకుండా పోయింది. ఎక్కడ వెదికినా కనిపించక పోవడంతో మహమ్మద్ ఇస్మాయిల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

అనంతరం న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు ఆదంబాక్కం పోలీసులు ఫాతిమాభాను కోసం వెతగ్గా రాయపురంలో దొరికింది. ఫాతిమాభానును సోమవారం సాయంత్రం న్యాయస్థానంలో హాజరు పరిచారు. న్యాయమూర్తి ఫాతిమాభానును విచారించారు. భర్త వెంట వెళ్లడానికి విముఖత వ్యక్తం చేసింది. ప్రియుడు ఐజాక్‌తోనే వెళతానని చెప్పింది. దీన్ని ఆమోదించని న్యాయస్థానం ఫాతిమాభానును తల్లిదండ్రుల వెంట పంపడానికి అనుమతించింది.

English summary
A woman from Tamilnadu told to court that she did not like to go with husband.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X